Blog Archive

Followers

Monday, October 26, 2009

నువ్వు నన్ను ...

పాతిపెట్టిన విత్తనంలోని చిగురాకూ నిద్రలో ఉంది
ఎందుకు నన్నీ వాక్యంముందు లేని అద్దంలో ఉంచుతావ్

తిరిగి చూడని అర్థాల్తో కాలం నల్లబడింది
ప్రేమే మరొక నలుపు కుంచె

నిస్తేజమైన వస్తువులన్నీ కదులుతున్నాయ్
నా నిరీక్షనే ప్రయాణించట్లేదు

ఏ వెలితీలేని అక్షరాలమధ్య
మళ్ళీ అక్షరం రాయటమే దుఃఖం

నువ్వు నన్ను సమాధిచేసుకునే నిశ్శబ్దానివి

2 comments:

raghu said...

ఏ వెలితీలేని అక్షరాలమధ్య
మళ్ళీ అక్షరం రాయటమే దుఃఖం

"సర్వ భావాలకూ వశుడై, పిమ్మట సర్వ భావాలనూ తన వశం చేసుకొని" అన్న అక్కిరాజు ఉమాకాంతం మాటలు ఇక్కడ నిజమైనట్టున్నాయి.

ఇప్పటి సో-కాల్డ్ "కవుల్లో" ఈ దుఃఖం ఎంతమందికి కలుగుతుంది?

మంచి కవిత, నాయుడు గారూ !

కొండముది సాయికిరణ్ కుమార్ said...

నిజం చెప్పారు - అన్నగారు (@ Raghu gaaru)
నిజమైన అనుభూతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే వాక్యమిది. ఇటువంటి ఒక్క లైను చాలు, కవిత్వం ఇది అని చెప్పటానికి.